హమ్మ‌య్య‌.. ఎట్ట‌కేల‌కు గెలిచారు. ఇంగ్లండ్‌పై టీమిండియా ఘ‌న విజ‌యం..!

-

ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న టెస్ట్ సిరీస్‌లో ఎట్ట‌కేల‌కు టీమిండియా బోణీ కొట్టింది. తొలి రెండు టెస్ట్ మ్యాచ్‌ల‌లో దారుణ ప‌రాజ‌యం పాల‌య్యాక‌, టీమిండియా ప్లేయ‌ర్లు ఇంటా బ‌య‌టా అనేక విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొన్నారు. అయితే వాట‌న్నింటికీ చెక్ పెడుతూ ఇంగ్లండ్ పై భార‌త్ మూడో టెస్టులో ఘ‌న విజ‌యం సాధించింది.

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో 203 పరుగుల తేడాతో భార‌త్‌ ఘన విజయం సాధించింది. చివరి రోజు 2.5 ఓవర్లు ఆడిన ఇంగ్లండ్ 317 పరుగుల దగ్గర చివరి వికెట్ కోల్పోయింది. 9 వికెట్లకు 311 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్.. మరో ఆరు పరుగులు మాత్రమే జోడించగలిగింది. 11 పరుగులు చేసిన ఆండర్సన్.. అశ్విన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ విజయంతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో కొన‌సాగుతోంది.

రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా 5, ఇషాంత్ 2, షమి, అశ్విన్, పాండ్యా తలా ఒక వికెట్ తీసుకున్నారు. బట్లర్ (106) సెంచరీ, స్టోక్స్ (62) హాఫ్ సెంచరీ చేసినా.. ఇంగ్లండ్‌ను గట్టెక్కించలేకపోయారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు విరాట్ కోహ్లికి ద‌క్కింది. కాగా ఈ సిరీస్‌లో నాలుగో టెస్ట్ ఈ నెల 30 నుంచి ప్రారంభం కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news