బలవంతంగా తెలంగాణను లాక్కున్నారు : వెల్లంపల్లి సంచలనం

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ షాకింగ్‌ కామెంట్స్ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు ఏపీపై అవాకులు, చవాకులు పేలడం మంచిది కాదని మండిపడ్డారు వెల్లంపల్లి శ్రీనివాస్. బల వంతంగా తెలంగాణ రాష్ట్రన్ని లాక్కున్నారు…. ఆర్ధికంగా బలంగా వున్నామని ఏపీపై విమర్శలు మంచిది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

శ్రీశైలం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తే నిధులు మంజూరుకు సీఎం సుముఖంగా ఉన్నారని… మాజీ సీఎం చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలో లేనప్పుడు ఒకలా మాట్లాడుతారని మండపడ్డారు వెల్లంపల్లి శ్రీనివాస్. చంద్రబాబు నిజాలు మాట్లాడితే తల వేయి వక్కలు అవుతుందని వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో ఎప్పుడో అన్నారని..వెల్లంపల్లి. కుప్పంలో జరిగే ఎన్నికలలో వైఎస్సార్ పార్టీ గెలుపు ఖాయమని… వెల్లంపల్లి శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. కాగా…  తెలంగాణ సొమ్ము దోచుకున్న ఆంద్రోళ్ళు ఇప్పుడు అడుక్కు తింటున్నారని నిన్న వివాదస్పద వ్యాఖ్యలు చేశారు  మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. అయితే.. దీనికి వెల్లంపల్లి తాజాగా కౌంటర్‌ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news