వామ్మో..! విందులో రెండు సార్లు భోజనం చేసిందని కర్రలతో దాడి..!

-

నిర్మల్ జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. కుబీర్ మండలం సేవాదాస్ నగర్ తండాలో ఓ శుభకార్యంలో మహిళ రెండోసారి భోజనం చేసిందని దాడి చేశారు. గత రెండు రోజుల క్రితం తండాలో ఓ విందు వేడుక జరిగింది. అయితే ఇదే తండాకు చెందిన రోజా భాయి అనే మహిళా భోజనం చేసేందుకు వెళ్ళింది. రెండోసారి సైతం భోజనం చేస్తుండగా.. గమనించిన కొందరు ఆమెను అడ్డుకొని దాడి చేశారు.

దీంతో ఇరువురి మధ్య ఘర్షణ చెలరేగగా.. సదరు మహిళ తలపై కర్రలతో దాడి చేశారు.ఘర్షణను ఆపడానికి వెళ్లిన వారికి సైతం గాయాలయ్యాయి. తీవ్ర గాయాలపాలైన మహిళను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు కుబీర్ పోలీసులు ఐదుగురు పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Latest news