Breaking : FRO శ్రీనివాసరావు కుటుంబానికి 50లక్షలు ఎక్స్‌గ్రేషియా

-

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం ఎర్రగూడ అటవీప్రాంతంలో గుత్తికోయల చేతిలో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు బలైన సంగతి తెలిసిందే. అయితే.. ఫారెస్ట్ రేంజ్ ఆఫీస‌ర్ శ్రీనివాసరావు మృతిప‌ట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. శ్రీనివాసరావు కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి ప్ర‌క‌టించారు. శ్రీనివాస‌రావు మృతికి కార‌కులైన దోషుల‌కు క‌ఠినంగా శిక్ష ప‌డేలా చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఎఫ్ఆర్‌వో శ్రీనివాస రావు కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు సీఎం కేసీఆర్. దాడిలో మరణించిన శ్రీనివాసరావు డ్యూటీలో వుంటే ఏ విధంగానైతే నిబంధనల ప్రకారం జీతభత్యాలు అందుతాయో అవే నిబంధనల ప్రకారం ఆయన కుటుంబానికి పూర్తి వేతనాన్ని అందించాలని ఆదేశించారు.

Sri K. Chandrashekar Rao

ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు వ‌ర‌కు వారి కుటుంబ సభ్యులకు ఈ వేతనం అందచేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. కారుణ్య నియామకం కింద కుటుంబ సభ్యుల్లో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. ఎఫ్ఆర్‌వో పార్థివ దేహానికి ప్ర‌భుత్వ అధికారిక లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించాల‌ని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాల‌ని సీఎస్ సోమేశ్ కుమార్‌ను సీఎం ఆదేశించారు. అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. శ్రీనివాస రావు అంత్యక్రియల్లో పాల్గొని సంబంధిత ఏర్పాట్లు దగ్గరుండి చూసుకోవాలని ఆదేశించారు సీఎం కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news