కేంద్ర మంత్రి కారుకు ప్రమాదం.. పోలీసులకు గాయాలు

-

కేంద్ర మంత్రి అశ్వినీ చౌబే కాన్వాయ్​లోని ఓ వాహనం ప్రమాదానికి గురైంది. ఎస్కార్ట్ వాహనాల్లోని కొరన్​సరాయ్ పోలీసు స్టేషన్​కు చెందిన ఓ కారు బోల్తా కొట్టిన ఘటనలో పలువురు పోలీసులు గాయపడ్డారు. కేంద్ర మంత్రి బక్సర్ నుంచి పట్నాకు వెళ్తుండగా ఆదివారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భగవంతుడి దయ వల్ల ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని కేంద్ర మంత్రి అశ్వినీ చౌబే ట్విటర్​లో తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో పోస్ట్ చేశారు.

మాథిలా- నారాయణ్​పుర్ రహదారిపై ఉన్న దుమ్​రావ్ వంతెనపై ప్రమాదం జరిగింది. ప్రమాదం అనంతరం కారును కేంద్ర మంత్రి పరిశీలిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. క్షతగాత్రులను కేంద్ర మంత్రే స్వయంగా ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఘటనలో పోలీసుల బొలేరో వాహనం క్రాష్ అయిపోయింది. వెనక ఉన్న కారు డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. ఘటనలో గాయపడ్డ పోలీసులను దుమ్​రావ్ సదర్ ఆస్పత్రికి తరలించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. వాహన డ్రైవర్​కు సైతం గాయాలయ్యాయని చెప్పారు. ఇద్దరు పోలీసులను మెరుగైన చికిత్స నిమిత్తం పట్నా ఎయిమ్స్​కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news