ట్రంప్ చాదస్తం మామూలుగా లేదుగా…

-

అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాట్లాడే మాటలు ఇప్పుడు వివాదాస్పదంగా మారుతున్నాయి. కరోన వైరస్  కట్టడి విషయంలో ముందు నుంచి ట్రంప్ తీసుకునే నిర్ణయాలపై ప్రపంచం మొత్తం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. నాకు అంతా తెలుసు అనే ధోరణి తో ఉండే ట్రంప్ లాక్ డౌన్ ని కీలక సమయంలో కూడా ప్రకటించడం లేదు. దీనిపై అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా భవిష్యత్తుని ట్రంప్ చంపేశారు అంటున్నారు.

ఇది పక్కన పెడితే తాజాగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. దేశంలో ఒక్క కేసు ప్రకటించగానే లాక్ డౌన్ ప్రకటించాలా…? అమెరికా అధ్యక్షుడుకి అడ్డు అనేది లేదు అంటూ మాట్లాడారు. ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు తెలుసు అంటూ మాట్లాడారు ట్రంప్. మీడియా నన్ను టార్గెట్ చేస్తుందని, దేశంలో నా నిర్ణయాలతో లక్షల మందిని కాపాడాను అని అన్నారు. నాకు సలహాలు ఇవ్వొద్దు అంటూ మీడియాను హెచ్చరించారు.

డెమొక్రాట్లతో కుమ్మక్కు అయి నన్ను టార్గెట్ చేస్తున్నారని, ఆయన ఆరోపించారు. నెల రోజులు టైం ఎందుకు వెస్ట్ చేసారని మీడియా ప్రశ్నించగా… నాకు ఎం చెయ్యాలో తెలుసు అన్నట్టు మాట్లాడారు. అమెరికా రాజ్యాంగాన్ని కూడా ఆయన తిట్టారు. కొన్ని దేశాలు చేసినట్టు గ్రేట్ అమెరికాను కూడా చెయ్యాలి అంటే ఎలా అని ఎదురు ప్రశ్నించారు. దీనితో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news