ప‌వ‌న్ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్‌.. ఫ్యాన్స్ కు పండ‌గే..!

-

మూడేళ్ల గ్యాప్ త‌ర్వాత వ‌చ్చినా కూడా త‌న ప‌వ‌ర్ ఏమాత్రం త‌గ్గ‌లేద‌ని నిరూపించాడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఇక ఈ సినిమా ఎంత పెద్ద సంచ‌ల‌నం సృష్టించిందో అద‌రికీ తెలిసిందే. ఈ హిట్ తో అభిమానులు తెగ సంబురాలు చేసుకుంటున్నారు. ఈ సినిమా త‌ర్వాత కూడా రెండు, మూడు సినిమాల‌ను లైన్ లో పెట్టేశాడు. ఇప్ప‌టికే హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. క్రిష్ డైరెక్ష‌న్ లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై భారీగానే అంచ‌నాలు ఉన్నాయి.


ఆ త‌ర్వాత సాగర్ కే.చంద్ర డైరెక్ష‌న్‌లో మలయాళం సినిమా రీమేక్ లో న‌టిస్తున్నాడు ప‌వ‌ర్‌స్టార్‌. ఈ రెండు సినిమాల తర్వాత త‌న‌కు గ‌బ్బ‌ర్‌సింగ్ లాంటి హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. పక్కా కమర్షియల్ ప్ల‌స్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్వారు నిర్మిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కలిసొచ్చిన మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు బాణీలు అందిస్తున్నాడు.
అయితే తాజా సమాచారం ప్ర‌కారం.. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నాడ‌ట‌. అంతే కాదండోయ్ ఈ సినిమాలో ఆయన డ్యూయల్ రోల్ లో ఇర‌గ‌దీస్తాడ‌ని తెలుస్తోంది. తండ్రి కొడుకుల పాత్రల్లో పవన్ కళ్యాణ్ నటిస్తాడ‌ని ఇండ‌స్ట్రీ లో టాక్‌. తండ్రి పాత్ర పోలీస్ అధికారిది అని, కొడుకు దేమో ఒక ట్రావెలర్ పాత్ర అని తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ మూవీకి ‘సంచారి’ అనే టైటిల్ ను ప‌రిశీలిస్తున్నారు. ఇక గ‌బ్బ‌ర్ సింగ్ స‌క్సెస్ మ‌ళ్లీ రిపీట్ అవుతుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news