మ‌రో బాలీవుడ్ డైరెక్ట‌ర్‌ని లైన్ లో పెట్టిన ప్ర‌భాస్‌.. భారీ సినిమాకు ప్లానింగ్‌!

-

బాహుబలి సినిమాతో ఒక్క సారిగా నేష‌న‌ల్ స్టార్ అయిపోయాడు ప్ర‌భాస్‌. ఈ సినిమా త‌ర్వాత ప్ర‌తీదీ పాన్ ఇండియా ప్రాజెక్టుల‌ను లైన్ లో పెడుతున్నాడు. వ‌రుస‌గా స్టార్ డైరెక్ట‌ర్ల‌ను లైన్ లో పెట్టిన ప్ర‌భాస్‌.. తాజాగా ఓ క్రేజీ అప్‌డేట్ వెలువ‌రించాడు. బాలీవుడ్‌లో యాక్షన్ సినిమాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్ట‌ర్ తో ఓ పెద్ద ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పాశాడ‌ని తెలుస్తోంది.
ప్ర‌భాస్ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోగా ఎదిగిపోయాడు. ఇప్పటికే ఈ ఆర‌డుగుల అంద‌గాడు నాగ్ అశ్విన్ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ తో సలార్ లాంటి భారీ సినిమాలు చేస్తున్నాడు. దీని త‌ర్వాత ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ లాంటి హిస్టారిక‌ల్ మూవీని లైన్‌లో పెట్టాడు. ఇక బాలీవుడ్‌లో యాక్షన్ సినిమాల‌తో గుర్తింపు తెచ్చుకున్న ఓ డైరెక్ట‌ర్ తో సినిమా ఓకే చేశాడ‌ని స‌మాచారం. ఈ ఏడాది ప్రభాస్ నుంచి రాబోతున్న మొదటి సినిమా రాధే శ్యామ్. దీనిపై భారీగా అంచ‌నాలు ఉన్నాయి.
ఇక తాజాగా ప్రభాస్ తన 24వ సినిమాను హిందీలో ‘బ్యాంగ్ బ్యాంగ్’, ‘వార్’ లాంటి భారీ యాక్షన్ సినిమాల‌ను తీసి దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న‌సిద్ధార్ధ్ ఆనంద్ డైరెక్ష‌న్‌లో సినిమా చేస్తున్నాడ‌ట‌. దీన్ని కూడా భారీగా ప్లాన్ చేస్తున్నార‌ని స‌మాచారం. ప్ర‌భాస్ క్రేజ్ ను ఆధారంగా చేసుకుని సినిమా తీయ‌నున్న‌రు. ప్ర‌స్తుతం సిద్దార్థ్ షారూక్ తో ఓ సినిమా తీస్తున్నాడు. దీని త‌ర్వాత హృతిక్ రోష‌న్ తో మ‌రో సినిమా తీయ‌నున్నాడు. ఈ లోపు ప్ర‌భాస్ కూడా త‌న సినిమాల‌ను పూర్తి చేసుకుని సిద్దార్థ్ తో సినిమా తీయ‌నున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news