వీర సింహారెడ్డి ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు హో .!

-

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య బాబు నటించిన తాజా చిత్రం వీర సింహారెడ్డి. ఈ సినిమా తాజాగా జనవరి 12న విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదల అయి మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఎక్కడా చూసినా బాలయ్య సినిమా గురించే చర్చ నడిచింది. మొదటి రోజు నుండే వసూళ్ళు కూడా అనుకున్నట్టే అదరగొట్టాయి.

మరో వైపు ఈ సినిమా లోని డైలాగ్స్ పై ప్రభుత్వం కూడా ఒక కన్ను వేసింది. ఇది కలకలం రేపింది. ఇక ఈ సినిమా వసూళ్ళు చూసుకుంటే కొద్దిగా చిరంజీవి సినిమా ఉండటం వల్ల కొంచం తగ్గిపోయాయని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయినా కూడా బాలయ్య బాబు వీర సింహ రెడ్డి తో బ్రేక్ ఈవెన్ ను దాటి, ప్రాఫిట్స్ లోకి వచ్చింది. ఇక ఆల్మోస్ట్ థియేటర్ వసూళ్ళు కూడా చివరి దశకు వచ్చాయి. ఇప్పడు అందరి కళ్లు ఓటిటి రిలీజ్ మీద పడ్డాయి.

ఓటీటీ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ డిస్నీప్లస్ హాట్ స్టార్ త్వరలో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 21 నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు. ఓటీటీ రైట్స్ కోసం భారీ డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఇక త్వరలో స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన కూడా వస్తుందని అంటున్నారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. వీరసింహారెడ్డిని మరోసారి చూసేందుకు ఓ టి టి ఫ్యాన్స్ కూడా సిద్ధం అవుతున్నారు

 

Read more RELATED
Recommended to you

Latest news