అభిమానిని చంపి భార్య ఫ్లాట్‌లో పూజలు.. దర్శన్ కేసులో రోజుకో సంచలనం

-

తన అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్‌ తూగుదీప చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో ఆయనకు సంబంధించిన సంచలన విషయాలను పోలీసులు వెలికితీస్తున్నారు. దర్శన్‌ వినియోగించిన లోఫర్స్‌ ఆయన భార్య విజయలక్ష్మి ఫ్లాట్‌ వద్ద గుర్తించిన పోలీసులు వీటినే హత్య సమయంలో అతడు వినియోగించాడని తెలిపారు. వీటి రికవరీతో కేసులో కీలక ఆధారాలను పోలీసులు దక్కించుకొన్నట్లైంది.

హత్య అనంతరం 9వ తేదీ తెల్లవారుజామున రేణుకాస్వామి మృతదేహాన్ని పారేసి హోస్కెరహల్లిలోని భార్య విజయలక్ష్మి ఫ్లాట్ కు చేరుకున్న దర్శన్ అక్కడినుంచి మైసూర్‌ బయల్దేరే ముందు ఇంట్లో పూజలు చేశాడని పోలీసుల విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో ఆమెకు కూడా సమన్లు జారీ చేసి బుధవారం రోజున ఐదు గంటలపాటు విచారించారు. ఈ హత్య అనంతరం కొన్ని దుస్తులు, ఫుట్‌వేర్‌ను దర్శన్‌ కాస్ట్యూమ్‌ అసిస్టెంట్‌ రాజు తెచ్చి విజయలక్ష్మికి ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఆమెను సాక్షిగా పోలీసులు భావించే అవకాశాలున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version