Big Boss OTT Telugu : వెరీ డిఫికల్ట్ టాస్క్ ఇచ్చిన ‘బిగ్ బాస్’.. హౌజ్‌లో మోస్ట్ ఇరిటేటింగ్ కంటెస్టెంట్ అతనే..

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ఓటీటీ వర్షన్ ఆసక్తికరంగా సాగుతోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ షోను అభిమానులు చూస్తున్నారు. కాగా, బీబీ లవర్స్ ను ఇంకా అట్రాక్ట్ చేసేందుకు నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా బిగ్ బాస్ నిర్వాహకులు మంగళవారం విడుదల చేసిన ప్రోమో సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.

షోలో కంటెస్టెంట్స్ కు బిగ్ బాస్ వెరీ డిఫికల్ట్ టాస్క్ ఇచ్చేశాడు. షోలో మోస్ట్ ఇరిటేటింగ్ కంటెస్టెంట్ ఎవరో వారికి మోస్ట్ ఇరిటేటింగ్ ఫ్లాగ్ ఇచ్చేయాలని సూచించాడు. ఈ క్రమంలోనే కంటెస్టెంట్స్ అందరూ తమను ఇరిటేట్ చేసే పర్సన్స్ నేమ్ చెప్పి వారకి ఫ్లాగ్స్ ఇచ్చేయడానికి ముందుకొచ్చారు. ప్రోమోలో ఎక్కువ మంది కంటెస్టెంట్స్ ఆ ఫ్లాగ్ ను నటరాజ్ మాస్టర్ కు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. అలా ఆయనే మోస్ట్ ఇరిటేటింగ్ కంటెస్టెంట్ అని ప్రూవ్ అవుతోంది.

బిందుమాధవి తో పాటు ఇంకా కొంత మంది మోస్ట్ ఇరిటేటింగ్ ఫ్లాగ్ ను నటరాజ్ మాస్టర్ కు ఇచ్చేశారు. ఇందుకు గల కారణాలను కూడా వారు వెల్లడించారు. నటరాజ్ మాస్టర్ సోది చెప్తారన్నట్లు వారు పేర్కొన్నారు. నటరాజ్ మాస్టర్ పాయింట్ లేకుండా మాట్లాడుతారని బిందు మాధవి చెప్పింది. అయితే, అషురెడ్డి మాత్రం బిందు మాధవియే మోస్ట్ ఇరిటేటింగ్ పర్సన్ అని తెలిపింది. ఆమెకు ఫ్లాగ్ ఇచ్చేసింది.

మిత్ర, అఖిల్, ముమైత్ ఖాన్ ఇలా కంటెస్టెంట్స్ అందరూ రీజన్స్ చెప్పి మోస్ట్ ఇరిటేటింగ్ ఫ్లాగ్స్ ఇచ్చేశారు. ఫైనల్ గా ఎవరు మోస్ట్ ఇరిటేటింగ్ పర్సన్ అనేది ఈ రోజు నైట్ 9 గంటలకు ఎపిసోడ్ స్ట్రీమ్ అయిన తర్వాతే స్పష్టమవుతుంది. 37వ రోజు ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version