రామ్‌చరణ్ సరసన మరోసారి కియారా అద్వానీ..!

-

తెలుగు చిత్ర పరిశ్రమకు భరత్ అనే నేను సినిమాతో తెరంగ్రేటం చేసిన భామ కియారా అద్వానీ. ఆమె తన అందంతో.. అభినయంతో తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి ఫాలోయింగ్ పెంచుకుంది. ఈ అమ్మడు నటించింది తక్కువ సినిమాలే అయినా ఆమెకు ఇక్కడ మంచి డిమాండ్ ఉంది. ఈ భామ బాలీవుడ్ భామ కియారా అద్వానీ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ జోష్‌లో దూసుకుపోతోంది. ఇక టాలీవుడ్‌ లో మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది ముంబై భామ కియారా.

ram charan

అయితే రామ్ చరణ్ కు జోడిగా వినయ విధేయ రామ సినిమాలో జతకట్టింది ఈ భామ. ఈ సినిమాలో ఈ భామ తన గ్లామర్ తో కుర్రకారులను ఉరుతలూగించింది. ఇక రామ్‌చరణ్ తో మరోసారి కియారా అద్వానీ జతకట్టనుందని సమాచారం. రెండోసారి ఈ జోడీ తెరపై కనపడనుందని టాక్. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్యలో ఈ ముద్దుగుమ్మ నటిస్తుందట.

ఈ సినిమాలో రామ్ చరణ్‌ అతిథి పాత్రలో కనిపిస్తారు. విద్యార్థి నాయకుడిగా ఆయన రోల్ ఉండనుంది. అయితే రామ్ చరణ్‌ కు జోడీగా కియారా అద్వానీని ఎంపిక చేశారని చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక వచ్చే నెలలో ఈ ఇద్దరూ చిత్రీకరణలో పాల్గొంటాంరని సమాచారం. మరోవైపు హిందీలో వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తోంది. ఆమె నటించిన హిందీ చిత్రం ఇందూకీ జవానీ ఈ నెల 11న రిలీజ్‌ కానుంది. ఇక వెబ్ సిరీస్ ‌లోనూ అదరగొడుతోంది ఈ బోల్డ్ బ్యూటీ. ఇక ఎన్టీఆర్.. త్రివిక్రమ్ కాంబినేషన్ ‌లో వచ్చే సినిమాలోనూ ఈ అమ్మడికి ఛాన్స్ వచ్చిందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news