బిగ్‌బాస్ 4లో ఆ జంట‌తో పాటు ఈ జంట కూడాన‌ట‌..!

-

బిగ్‌బాస్ 4 తెలుగు సీజ‌న్ అతి త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోతుంది. ఈ మేర‌కు షో నిర్వాకులు ఏర్పాట్లు చేస్తున్నారు. షోలో పాల్గొనే కంటెస్టంట్స్ దాదాపుగా ఫైన‌ల్ అయిన‌ట్లు స‌మాచారం. క‌రోనా నేప‌థ్యంలో ప‌ది రోజుల పాటు కంటెస్టంట్స్ ని క్వారంటైన్‌లో ఉంచి, త‌రువాత హౌస్‌లోకి తీసుకోనున్న‌ట్లుగా తెలుస్తుంది. అయితే గ‌త సీజ‌న్‌లో వ‌రుణ్ సందేశ్ వితిక‌ల జంట షోలో పాల్గొన‌గా ఈ సీజ‌న్‌లో రెండు జంట‌ల‌ను షో కోసం ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తుంది.


డ్యాన్స్ మాస్ట‌ర్ ర‌ఘు, సింగ‌ర్ ప్ర‌ణ‌వీల జంట‌ను ఎంపిక చేసిన‌ట్లు గ‌తంలోనే వార్త‌లు వ‌చ్చాయి. ఇక తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ జంట‌తో పాటు రెండో జంట‌గా జాహ్న‌వి (మ‌హాత‌ల్లి) క‌పుల్ ఎంట్రీ ఇవ్వ‌నుట్లుగా తెలుస్తుంది. షోని మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మార్చే దిశ‌గా మ‌రిన్ని ఆక‌ట్టుకునే గేమ్స్‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే కంటెస్టంట్స్ త‌మ ఆర్మీల‌ను రెడీ చేస్తున్నారట‌.

గ‌త సీజ‌న్‌లో వ‌రుణ్ వితిక‌లు బాగా ఆక‌ట్టుకున్నారు. వ‌రుణ్ కూల్‌గా, వితిక ఫైర్ బ్రాండ్‌గా జంట చూడ‌ముచ్చ‌ట‌గా ఒక‌రికొక‌రు స‌పోర్టు చేసుకుంటూ షోలో కొన‌సాగారు. మ‌రి ఈ సారి రెండు జంట‌లు రాబోతున్నాయి.. బిగ్ బాస్ హౌస్‌లో ఇంకా ఏం జ‌ర‌గ‌బోతుందో చూడాలంటే ఆగ‌స్ట్ 30 వ‌ర‌కు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news