ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన కుటుంబ సభ్యులు.. కిక్కిరిసిన‌ ఎన్టీఆర్ ఘాట్..

-

నేడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు 24వ వర్ధంతి. ఎన్టీఆర్ వర్థంతి కావడంతో.. హైదరాబాద్‌లోని ఘాట్‌‌లో వద్ద కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్ రామ్‌, దగ్గుబాటి వెంకటేశ్వరరావు దంపతులు పుష్పగుఛ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. కొద్దిసేపు ఘాట్‌లోనే కూర్చొన్నారు. దీంతో హైదరాబాద్‌, నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్ అభిమానులు, కుటుంబ సభ్యులతో నిండిపోయింది.

Actor Navdeep, Co Founder C Space Along With Rakesh Rudravanka – CEO – C Space

మరోవైపు, ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. తమ అభిమాన నటుడిని గుర్తు చేసుకుని నివాళులు అర్పిస్తున్నారు. ఇటు ఆయన వర్ధంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు, టీడీపీ కార్యకర్తలు రక్తదాన, ఉచిత వైద్య శిబిరాలు, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news