కరాటే కళ్యాణి కి నోటీసులు జారీ చేశాం – హైదరాబాద్ కలెక్టర్

-

టాలీవుడ్ నటి కరాటే కళ్యాణి కి నోటీసులు జారీ చేశామని.. హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ ప్రకటన చేశారు. కరాటే కళ్యాణి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం లేదని.. ఈ రోజు మరొక నోటీసులు జారీ చేస్తామని స్పష్టం చేశారు హైదరాబాద్ కలెక్టర్ శర్మన్.

రేపటి వరకు కల్యాణి హాజరు కాకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. పిల్లలను దత్తత తీసుకోవాలంటే కొన్ని రూల్స్ ఉంటాయా ? దాని ప్రకారమే దత్తత తీసుకునే ప్రక్రియ వుంటుందన్నారన్నారు హైదరాబాద్ కలెక్టర్ శర్మన్. ఎవరికి నచ్చినట్లు వారు తీసుకుంటే కుదరదదు.. కలెక్టర్ శర్మన్ స్పష్టం చేశారు. చట్టానికి విరుద్ధంగా వెళ్తే మూడేళ్ల జైలు శిక్ష పడుతుందని తెలిపారు హైదరాబాద్ కలెక్టర్ శర్మన్.

ఇది ఇలా ఉండగా కరాటే కళ్యాణి తల్లి విజయలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరాటే కళ్యాణి మరియు మౌక్తిక నిన్న వెళ్లారు.. ఎక్కడికి వెళ్ళారో తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు..నిన్నటి నుండి ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుందని.. నా కూతురు పై కావాలని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహించారు. తమ దగ్గర డబ్బులు తీసుకొని మాపైనే ఆరోపణలు చేస్తున్నారని… శ్రీకాంత్ రెడ్డి నా కూతురు పై అటాక్ చేస్తానని బెదిరించాడని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version