క‌న్నీళ్లు పెట్టించ‌నున్న ప్ర‌భాస్‌.. మ్యాట‌ర్ ఏంటంటే..!!

-

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌.. బాహుబలి, సాహో చిత్రాల తర్వాత ఈయ‌న క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌స్తుతం డార్లింగ్‌ జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా ప‌ట్టాలెక్కించిన సంగ‌తి తెలిసిందే. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తుంది. గత కొంతకాలంగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే ప్ర‌స్తుతం లాక్‌డౌన్ కార‌ణంగా షూటింగ్స్ బంద్ అవ్వ‌డంతో ప్ర‌భాస్ సినిమాకు సైతం బ్రేక్ ప‌డింది.

పునర్జన్మల నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ సినిమా రూపొందుతోందని, ఇందులో ప్రభాస్ పాత్ర గతంలో ఎన్నడూ చూసని విధంగా ఉంటుంద‌న్న వార్త‌లు ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. 1960కాలం నాటి పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కే ఈ సినిమా క్లైమాక్స్ లో ప్ర‌భాస్ కన్నీళ్లు పెట్టించేస్తాడ‌ట‌. అది కూడా ముఖ్యంగా ముఖ్యంగా హీరోహీరోయిన్ల మధ్య చోటుచేసుకునే ఎమోషనల్ సీన్స్ లో ప్రభాస్ ప‌లికే హావ‌భావ‌ల‌కు ప్రేక్ష‌కుల‌కు కన్నీళ్లు ఆగ‌వ‌ని అంటున్నారు.

వాస్త‌వానికి ఇంతకుముందు ప్రభాస్ సినిమాల్లోను యాక్షన్ తో పాటు ఎమోషన్ ఉంది. అయితే, అది ఈ సినిమాలో మరింత సున్నితంగా ఉండి మ‌న‌సులను తాకుతుందని తెలుస్తోంది. ఏదేమైనా ఈ సినిమా క్లైమాక్స్ ద్వారా ప్ర‌భాస్ ప్రేక్ష‌కుల‌ను క‌న్నీళ్లు పెట్టించ‌డం ఖాయ‌మంటున్నారు. కాగా, లాక్‌డౌన్ త‌ర్వాత శ‌ర‌వేగంగా షూటింగ్ పూర్తి చేసి.. ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని చూస్తున్నారు చిత్ర‌యూనిట్‌. ఇక ఈ సినిమాకు మొదట జాను అనే టైటిల్ అనుకున్నప్పటికీ ఆ తర్వాత ఓ డియర్, రాధే శ్యామ్ అనే టైటిల్స్ పరిశీలనలో పెట్టారు. త్వ‌ర‌లోనే ఈ రెండిటిలో ఒక‌టి ఫైన‌ల్ చేయ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news