‘హనుమాన్‌’ ఓటీటీ రిలీజ్‌పై ప్రశాంత్ వర్మ లేటెస్ట్ పోస్ట్‌

-

తేజ సజ్జా ప్రధాన పాత్రలో ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘హను-మాన్‌’. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి వండర్స్ సృష్టిస్తోంది. బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మొదట మార్చి 2 న జీ5లో స్ట్రీమింగ్ అవుతుందని, ఆ తర్వాత మార్చి 8వ తేదీన వస్తుందని టాక్ వినిపించింది. ఇక తాజాగా మార్చి 15నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు పోస్టులు దర్శనమిచ్చాయి. కానీ అది కూడా జరగలేదు. చిత్రబృందం మాత్రం దీని విడుదలపై స్పష్టతనివ్వకుండా ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతోంది.

తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పోస్టుతో అభిమానులు మరింత నిరాశకు గురయ్యారు. ‘‘హనుమాన్‌’ ఓటీటీ విడుదల ఆలస్యమవుతోంది. ఉద్దేశపూర్వకంగా చేస్తోంది కాదు. వీలైనంత త్వరగా మీ ముందుకు తీసుకురావడానికి మా టీమ్ అవిశ్రాంతంగా పనిచేస్తోంది. మీకు ఉత్తమమైనది అందిచాలన్నదే మా ఉద్దేశం. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మాకు సపోర్ట్‌ చేస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు’ అని ప్రశాంత్‌ వర్మ మరో పోస్ట్‌ పెట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version