సరైన నటుడితో నా డ్రీమ్ ప్రాజెక్టు ‘జన గణ మన’.. పూరీ జగన్నాథ్

-

టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నా్థ్ ప్రజెంట్ ‘లైగర్’ ఫిల్మ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా వైడ్ గా ఈ నెల 25న ఈ పిక్చర్ రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పూరీ జగన్నాథ్ తన డ్రీమ్ ప్రాజెక్టు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తన డ్రీమ్ ప్రాజెక్టు ‘జన గణ మన’ ను సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేయాలనుకున్నానని, ఈ విషయమై ఒకసారి తాను మహేశ్ తో కలిసి ప్రకటించానని గుర్తు చేసుకున్నారు పూరీ. తన కలల కథ అయిన ‘జన గణ మన’ను చేయాలని ఇద్దరం అనుకున్నామని, కానీ, ఇప్పటికీ పనులు జరగలేదని పూరీ జగన్నాథ్ వివరించారు.

తాను పదేళ్ల కిందటే ‘జన గణ మన’ కథను రాసుకున్నానని, సరైన నటుడితోనే ఆ కథ రాబోతున్నదని చెప్పుకొచ్చారు. ‘లైగర్’ తర్వాత పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ మరో సినిమా ‘జన గణ మన’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఇకపోతే ‘జన గణ మన’లో యాక్షన్ సీక్వెన్సెస్ నెక్స్ట్ లెవల్ లో ఉంటాయని పూరీ చెప్పారు.

‘జన గణ మన’లో యాక్షన్ సీక్వెన్సెస్ కోసం ప్లానింగ్ చేస్తున్నట్లు చెప్పారు డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ. రెండు నెలల పాటు మొరాకోలో యాక్షన్ సీక్వెన్సెస్ ట్రైనింగ్ కు వెళ్తున్నట్లు తెలిపారు. విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా ఇందులో టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ వంశీ పైడిపల్లి ‘జన గణ మన’కు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 3న ‘జన గణ మన’ విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news