చెల్లిలాంటి ఆమెతో పెళ్లనడానికి సిగ్గుండాలి..!

-

మెగా హీరో సాయి తేజ్ వరుస ఆరు ఫ్లాపుల తర్వాత వచ్చిన చిత్రలహరి హమ్మయ్య అనుకునేలా చేసింది. కిశోర్ తిరుమల డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్స్ గా నటించగా దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు. ఏప్రిల్ 12న రిలీజ్ సక్సెస్ అయిన ఈ సినిమాకు ఇప్పటికి ప్రమోషన్స్ చేస్తున్నారు సాయి తేజ్.

ఓ ఇంటర్వ్యూలో భాగంగా తన పెళ్లి గురించి స్పందించాడు సాయి తేజ్. తన పెళ్లిపై వస్తున్న రూమర్స్ గురించి మాట్లాడుతూ తనకు నిహారికకు లింక్ పెడుతున్నారని. తను నా చెల్లిలాంటిదని ఆమెతో తన పెళ్లి అంటూ వార్తలు రాయడానికి సిగ్గుండాలని అన్నాడు సాయి తేజ్. తాను, వరుణ్, నిహారిక, వైష్ణవ్ తేజ్ ఇలా మేమంతా అన్నదమ్ముల్లా పెరిగామని అలాంటి మా మాకు పెళ్లంటూ వార్తలు రాయడం ఎంతవరకు కరెక్ట్ అని అన్నాడు. ఇలాంటి వార్తలు రాసేముందు ఓసారి ఆలోచించాలని.. మా పర్సనల్ లైఫ్ లో తొంచి చూడాల్సిన అవసరం లేదని అన్నాడు సాయి తేజ్.

Read more RELATED
Recommended to you

Latest news