అథ్లెట్స్‌లా మారిపోతోన్న టాలీవుడ్ బ్యూటీస్

-

హీరోయిన్లు ఇంతకుముందు స్లిమ్‌గా ఉంటే చాలు అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్‌ మారిపోతోంది. స్లిమ్‌గా కాదు, ఫిట్‌గా ఉండాలనుకుంటున్నారు. అథ్లెట్స్‌లా జిమ్ముల్లో గంటలకొద్ది కష్టపడుతున్నారు. కేజీల కొద్ది బరువులు ఎత్తుతూ, మెంటల్‌గానే కాదు, ఫిజికల్‌గానూ చాలా స్ట్రాంగ్‌ అనిపించుకుంటున్నారు టాలీవుడ్‌ బ్యూటీస్.

టాలీవుడ్‌ బ్యూటీస్‌ ఫిట్‌నెస్‌ ఫ్రీక్స్‌లా మారిపోతున్నారు. సమంత నుంచి మొదలుపెడితే నభా నటేశ్ వరకు హీరోయిన్లంతా జిమ్ముల్లో కుస్తీలు పడుతున్నారు. స్పోర్ట్స్‌ పర్సన్స్‌లా వెయిట్‌ లిఫ్టింగులు కూడా చేసేస్తున్నారు. ఇక నభా నటేశ్ అయితే ట్రాక్టర్‌ టైర్‌తో కుస్తీలు పడుతూ, ఫిట్‌నెస్‌ పెంచుకుంటోంది.

టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్లు పూజా హెగ్డే, రష్మిక మందన్న కూడా ఫిట్‌నెస్‌కి చాలా ప్రియారిటీ ఇస్తున్నారు. లాక్‌డౌన్‌తో జిమ్ములు అన్ని మూతబడిపోయినా వీళ్లు మాత్రం వర్కవుట్లు ఆపలేదు. పూజ అయితే ఇంట్లోనే యోగాసనాలు వేసింది. అభిమానులకి కూడా మోటివేట్ చేసింది.

సమంత, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అయితే వర్కవుట్స్‌ని డైలీ రొటీన్‌గా మార్చేసుకున్నారు. ఇద్దరూ ఫిట్‌నెస్‌ అనే పదానికి మరో పేరులా మారిపోయారన్నట్లు వెయిట్‌ లిఫ్టింగులు, డెడ్‌ లిఫ్టింగులు చేస్తున్నారు. అయితే ఈ వర్కవుట్స్‌ ఎక్కువై వీళ్ల ఫేస్‌లో గ్లో తగ్గిపోయిందనే కామెంట్స్‌ కూడా వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news