ప్రత్యూష గరిమెళ్ళ ఆత్మహత్యపై ఎమోషనల్ ట్వీట్ చేసిన ఉపాసన..!!

-

ఇటీవల హైదరాబాద్ మహానగరానికి చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ళ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.. ఇక ఈమె మరణంపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన ట్వీట్ చేశారు. ఎమోషనల్ అవుతూ ఉపాసన చేసిన ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.. ఇక ఉపాసన ప్రత్యూష నూ తన డియరెస్ట్ ఫ్రెండ్ అంటూ రాసుకొచ్చింది.. ప్రత్యూష చాలా త్వరగానే మరణించడం చాలా బాధాకరం అని కూడా తెలిపింది ఉపాసన. ప్రత్యూష మరణం తాను జీర్ణించుకోలేనిది అని తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.

తన ప్రియమైన స్నేహితురాలు తమ మధ్య లేకపోవడం ఇప్పటికీ తాను నమ్మలేక పోతున్నాను అంటూ ఆ పోస్టులో ఉపాసన తన ఆవేదనను అక్షర రూపంలో వ్యక్తం చేసింది. ప్రత్యూష గరిమెళ్ళ ప్రతి విషయంలో కూడా చాలా ఉన్నతంగా ఆలోచించేది అని.. అటు కెరియర్ పరంగా.. కుటుంబం, స్నేహితులు, సన్నిహితుల పరంగా అన్ని విషయాలలో కూడా ఉన్నత నిర్ణయాలు మాత్రమే తీసుకునేది అని ఉపాసన తెలిపింది. ఇలా అన్ని విషయాలను ఉన్నతంగా ఆలోచించే ప్రత్యూష డిప్రెషన్ కి గురి కావడం అనేది చాలా బాధ కలిగిస్తోంది అంటూ తన ఆవేదనను తెలిపింది ఉపాసన. ఇకపోతే ప్రత్యూష ఆత్మకు శాంతి కలగాలని ఉపాసన ఆకాంక్షించారు. ఇకపోతే తనతో కలిసి ప్రత్యూష దిగిన ఫోటో ను ఉపాసన తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేయడం జరిగింది.

ప్రత్యూష గరిమెళ్ళ ఆత్మహత్యకు గల కారణాలు ఇప్పటికీ బయటకు రాలేదు. మరి ఈమె ఏ కారణం చేత ఆత్మహత్య చేసుకుంది అనే విషయం తెలుసుకోవడానికి ఇంకా పోలీసులు ఎంక్వైరీ చేపడుతున్నారు. ఉపాసన చేసిన ఈ ట్వీట్ కాస్త ప్రస్తుతం బాగా వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version