నిలుచున్న నంది ఉన్న క్షేత్రం ఎక్కడో తెలుసా!!

-

సాధారణంగా శివాలయాల్లో శివుడికి ఎదురుగా ఆయన వాహనం నంది కూర్చుని ఉంటుంది. కానీ ఇక్కడ
నంది స్వామి పట్ల తన గౌరవాన్ని చూపుతూ నిలబడి ఉంటుంది. ఇక్కడి మరకత లింగ అభిషేకం నేత్రానందం కలిగించేది ఉంటుంది. ఆరు కాలాలలో ఇక్కడి శివుడికి ఆరాధన జరుగుతుంది. ఆ క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం.. తమిళనాడు లోని అత్యంత పురాతన ఆలయాలలో త్యాగరాజస్వామి ఆలయం ఒకటి. ఇది తమిళనాడులోని కుంభకోణానికి సమీపంలో ఉన్న ప్రసిద్ద పుణ్యక్షేత్రం. ఈ ఆలయాన్ని కమలాపురం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో ప్రముఖంగా త్యాగరాజేశ్వరుడు కొలువై ఉన్నాడు. పురాణాల ప్రకారం ఈ ఆలయ విశిష్టతను ప్రస్తావించే సందర్భంలో ముఖ్యమైన దైవ స్వరూపాలుగా ఉన్న వాల్మీకేశ్వరుడు, సోమాస్కంద మూర్తి, కమలాంబికల గురించి కూడా విశేషంగా పేర్కొన్నాయి.

ఇంద్రుడు ఆరాధించిన సోమస్కందమూర్తి
పురాణ గాథాల ప్రకారం ఒక సారి రాక్షసులకు, ఇంద్రునికి మధ్య యుద్దం సంభవించింది. ఆ సమయంలో ఇంద్రునికి ముచికుందుడు సహాయం చేశాడట. అందుకు ప్రతి ఫలంగా ముచికుందుడు ఇంద్రుడు పూజించే సోమాస్కంద మూర్తిని కావాలని కోరుతాడు. సోమాస్కంద మూర్తిని మొదట విష్ణువు కొంతకాలం పూజించి సోమాస్కంద మూర్తిని మొదట విష్ణువు కొంతకాలం పూజించి తర్వాత దాన్ని ఇంద్రునికి ఇస్తాడు. అయితే ఆ విగ్రహాన్ని ముచికుందుడుకు ఇవ్వడానికి ఇష్టపడని ఇంద్రుడు రాత్రికి రాత్రి దేవశిల్పి విశ్వకర్మను పిలిపించి ఆ మూర్తిని అచ్చంగా పోలి ఉండే మరో ఆరు మూర్తులను తయారుచేయిస్తాడు. అయితే ముచికుంద శివుని అనుగ్రహంతో అసలు మూర్తిని గుర్తించడంతో ఇంద్రుడు ఆ సోమాస్కంద మూర్తిని ముచికుందకు ఇవ్వక తప్పలేదు. అలా పొంది పూజించిన సోమాస్కందమూర్తినే ముచికుందుడు తిరువారూర్‌లో ప్రతిష్టించాడు. ఈ మూర్తినే వీధి విడంగర్ అని పిలుస్తుంటారు.

32 ఏకరాల విశాలమైన కోనేరు
ఈ ఆలయంలో కనిపించే కొలనునే కమలాలయం అని పిలుస్తారు. ఇది అతి విశాలమైన సుందరమైనదిగా దర్శనమిస్తుంది. ఈ కోనేరు ఆలయమంత పెద్దది, ముప్పై మూడు ఎకరాలలో విస్తరించి ఉంది. దేశంలోనే అతి పెద్దదిగా ప్రసిద్ది చెందినది. మహాలక్ష్మీ విష్ణువును వివాహమాడాలని ఇక్కడి మూలస్థానేశ్వరుని ఉద్దేశించి తపస్సు చేసింది. అందుకే ఇక్కడి కోనేరుకు కమలాలయం అని పేరు వచ్చింది. కొలను మధ్యలో నాదువన నాథుని ఆలయం కూడా ఉంటుంది. ఇక్కడి ప్రదోష అభిషేకం చాలా విశేషంగా ఉంటుంది.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news