రెండేళ్ల తర్వాత మాడవీధుల్లో వేంకటేశ్వరస్వామి విహారం

-

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి రెండేళ్ల తర్వాత మాడవీధుల్లో విహరించనున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల భారీ సంఖ్యలో తిరుమలకు వచ్చే అవకాశం ఉందని తితిదే అంచనా వేస్తోంది. కొవిడ్ కారణంగా రెండేళ్లుగా ఏకాంతంగా నిర్వహించిన సాలకట్ల బ్రహ్మోత్సవాలను ఈసారి భక్తుల మధ్య నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఏర్పాట్లు చేస్తోంది.

సెప్టెంబరు 20న ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఆలయంలో సంప్రదాయబద్ధంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 27 నుంచి అక్టోబ‌రు 5 (9 రోజులు) వ‌ర‌కు ఆల‌య మాడవీధుల్లో వివిధ రకాల వాహ‌న‌సేవ‌ల్లో స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నట్లు తితిదే పేర్కొంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తితిదే వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version