రంగారెడ్డి : ‘గడ్డిఅన్నారం మార్కెట్ కూల్చివేత ఆపండి’

-

గడ్డి అన్నారం మార్కెట్‌లో కూల్చివేతలు ఆపాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వందల మంది పోలీసులను మోహరించి మార్కెట్ కూలుస్తున్నారని పిటిషనర్లు హైకోర్టుకు తెలపడంతో కూల్చివేతల తీరు దురదృష్టకరమని హైకోర్టు పేర్కొంది. మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు, డైరెక్టర్ లక్ష్మీబాయి విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. విచారణను ఈనెల 14కి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version