సూర్యాపేట: తీవ్ర విషాదం.. ముగ్గురు యువకులు మృతి

-

రెండు బైకులు ఢీకొని ముగ్గురు యువకులు మృతి చెందిన ఘటన శుక్రవారం తెల్లవారుజామున సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం నసీమ్ పేట గ్రామంలో చోటు చేసుకుంది. మృతులు బానోతు అరవింద్ (తెట్టేకుంట తండా), బుక్య నవీన్(బోత్యా తండా), దరవత్ ఆనంద్ (లక్ష్మీ నాయక్ తండా). ఏపూరుతండాకు చెందిన వినేశ్‌కు తీవ్ర గాయాలైయ్యాయి.. దీంతో హైదరాబాద్‌ లోని ఆస్పత్రికి తరలించారు. మృతులంతా ఇరవై రెండేళ్ల యువకులే కావడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version