తెలంగాణాలో భారీగానే..2,932 కేసులు, 11 మరణాలు !

-

తెలంగాణాలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. పక్క రాష్ట్రం ఏపీతో పోలిస్తే కేసుల నమోదు తక్కువే ఉన్నా తెలంగాణా వాసులను కరోనా భయం వీడ లేదు. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో 2,932 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 1,17,415కి చేరింది. ఇక నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో 11 మంది కరోనా వలన చనిపోయారు దీంతో ఇప్పటిదాకా కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 799కు చేరింది.

coronavirus
coronavirus

ఇక ఇప్పటిదాకా కరోనా నుండి 87,675 మంది కోలుకోగా నిన్న ఒక్కరోజే 1580 మంది కరోనా బారి నుండి కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో 28,941 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. అందులో 22,097 మంది హాస్పిటల్స్ లో కాకుండా హోం ఐసోలేషన్ లోనే ఉన్నారు. ఇక నిన్న ఒక్కరోజే 61,863 శాంపిల్స్ టెస్ట్ చేయగా ఇప్పటిదాకా టెస్ట్ చేసిన శాంపిల్స్ సంఖ్య 12,04,343కి చేరింది. ఎప్పటిలానే జీహెచ్ఎంసీలో భారీగా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజే ఇక్కడ 520 కేసులు నమోదు కాగా ఆ తరువాతి స్థానంలో రంగారెడ్డి జిల్లా 218 కేసులతో నిలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news