వామ్మో.. విందుకు పిలిస్తే ఏకంగా బంగారాన్ని మింగేశాడు..

-

ఏదైనా పండగలు వస్తే పార్టీలు , విందులు ఈరోజుల్లో కామన్ అయిపోయాయి..అయితే పార్టీలకు కేవలం తెలిసిన వాళ్ళను మాత్రమే పిలచాలి. లేకుంటే మాత్రం మన గొయ్యిని మనమే తవ్వుకున్న వాళ్ళము అవుతాము.తాజాగా ఓ వింత ఘటన ఎదురైంది. రంజాన్ సందర్భంగా ఓ మహిళ తన తోటి స్నేహితురాలిని ఇంటికి పిలిచింది. అయితే ఆ విందుకు ఓ యువతి తన బోయ్ ఫ్రెండ్ ను కూడా తీసుకొని వచ్చింది. పీకలుదాకా ఫుల్లుగా తాగాడు..కడుపు నిండా తిన్నాడు. చివరికి అన్నం పెట్టిన ఇంటికి కన్నం వేశాడు. బిర్యాని తో పాటుగా నగలను కూడా మింగేశాడు.

gold Price | బంగారం ధరలు
gold Price | బంగారం ధరలు

అది ఎలా సాధ్యం అనే సందేహం అందరికి వస్తుంది కదూ.. ! ఒకసారి వివరంగా తెలుసుకుందాం..ఈ విచిత్ర ఘటన తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరంలో వెలుగుచూసింది. చెన్నై నగరంలోని నగల దుకాణంలో పనిచేస్తున్న స్నేహితులతో పాటు ప్రియుడు కూడా పార్టీకి వచ్చాడు. స్నేహితురాలి ప్రియుడు మద్యం మత్తులో బిర్యానీతోపాటు వజ్రాల నెక్లెస్, బంగారు గొలుసు,డైమండ్ లాకెట్ లను మింగేశాడు. అతిథులు వెళ్లిన తర్వాత తన ఇంట్లోని అలమారాలో వజ్రాల నెక్లెస్, బంగారు గొలుసు, డైమండ్ లాకెట్ కనిపించకుండా పోయిందని గమనించిందామె.

దీంతో అందరినీ సెర్చ్ చేసింది. ఓ వ్యక్తి పై అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు వైద్యుడితో నిందితుడి పొట్టను స్కానింగ్ చేయించగా ఆభరణాలు కడుపులో ఉన్నాయని తేలింది. దీంతో వైద్యులు నిందితుడికి గురువారం ఎనీమా చేసి రూ.95 వేల విలువైన బంగారు హారం, రూ.25వేల బంగారాన్ని వెలికితీసి పోలీసులకు అప్పగించారు. ఇంకా అతని కడుపులో పెండెంట్ ఇంకా ఉండడిపోవడంతో దాన్ని బయటకు తీయడానికి అతనికి లాక్సిటివ్స్ ఇచ్చారు. విందు ఇచ్చిన బాధిత మహిళ కేసు నమోదు చేయడానికి ఇష్టపడలేదు.మద్యం మత్తులో చేశాడని, అతని తప్పు లేదని వదిలేసింది. ఏది ఏమైనా అంత భారీ నగలను ఎలా మింగాడు అనే సందేహాలు మాత్రం అందరినీ కలచివేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news