రాజ‌ధాని భూముల‌తో చంద్ర‌బాబు వ్యాపారం: క‌న్నా ఆరోప‌ణ‌

-

విజయవాడ: సీఎం చంద్రబాబుపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. రాజధాని భూములతో సీఎం వ్యాపారం చేస్తున్నారని, పచ్చ కండువా వేసుకున్న వారికే సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఆరోపించారు. రాజధానికి కేంద్రం రూ. 2500 కోట్లు ఇస్తే 4 భవనాలను కూడా నిర్మించలేదని, రాజధాని కోసం రైతుల నుంచి భూములు తీసుకున్నారే తప్ప… అందులో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని ఆయన దుయ్యబట్టారు. రాజధాని కోసం ప్రజల నుంచి సేకరించిన విరాళాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్‌ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version