అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం పై ఆస్ట్రేలియా, పాకిస్తాన్ క్రికెటర్ల పోస్ట్…

-

ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నిన్న అయోధ్యలో ఘనంగా జరిగింది. అయితే ఈ వేడుకపై అనేకమంది ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. తాజాగా ఈ వేడుకపై ఆస్ట్రేలియా , పాకిస్తాన్ ఆటగాళ్లు సోషల్ మీడియా వేదికగా స్పందించారు .దీంతో వీరు చేసిన ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఇటీవలే టెస్ట్ క్రికెట్ కి గుడ్ బై చెప్పిన ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన ఇన్స్టాగ్రామ్ లో ‘జై శ్రీరామ్ ఇండియా’అంటూ పోస్ట్ చేశారు. గతంలో కూడా వార్నర్ ఇండియా పై గల తన అభిమానాన్ని పలు సందర్భాలలో చాటుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ వేడుకపై పాకిస్తాన్‌ క్రికెటర్ డానిష్ కనేరియా కూడా స్పందించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మహోత్తర ఘట్టం పూర్తయినందుకు ఆనందం వ్యక్తం చేశారు.‘శతాబ్దాల నిరీక్షణ ముగిసింది.. ప్రతిజ్ఞ నెరవేరింది.. ప్రాణ ప్రతిష్ట పూర్తైంది’ అంటూ తన ట్విట్టర్(ఎక్స్) లో పోస్టు చేసారు.హిందూ కుటుంబానికి చెందిన సౌత్ ఆఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ కూడా ‘జై శ్రీరామ్’ అంటూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version