బీసీలకు కేసీఆర్‌ సర్కార్‌ శుభవార్త..32 బీసీ భవనాలకు సామూహిక భూమి పూజలు

-

బీసీలకు కేసీఆర్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో 32 బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలు ప్రారంభించేందుకు ఫిబ్రవరి 5, 6 తేదీల్లో సామూహిక భూమి పూజలు నిర్వహిస్తామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.

దసరా నాటికి ఈ భవనాల నిర్మాణాలు పూర్తవుతాయని వెల్లడించారు. రాష్ట్రంలో 41 బీసీ భవనాల కోసం 87.3 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని ఈ సందర్భంగా చెప్పారు. ఆత్మగౌరవ భవనాలను సొంతంగా నిర్మించుకునే అవకాశాన్ని ఆయా కుల సంఘాలకే ఇచ్చామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version