ముంబై‌లోని బాంద్రా రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట.. 9 మందికి గాయాలు!

-

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. రోడ్లు, ప్రజారవాణా వ్యవస్థలో విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. రద్దీని తట్టుకోవడం ఒక్కోసారి రైల్వే, బస్సు సర్వీసులు కూడా సరిపోవు. ఈ క్రమంలో ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం బాంద్రా టెర్మినస్‌లో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనలో 9 మందికి పైగా ప్యాసింజర్స్ గాయపడినట్లు సమాచారం. అంతకుముందు బాంద్రా- గోరఖ్ పూర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కడానికి ఫ్లాట్ ఫాం-1కి విపరీతమైన ప్రయాణికులు వచ్చారు. ట్రైన్ రావడంతో ఒక్కసారిగా ఎక్కేందుకు జనాలు ఎగబడ్డారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో మహిళలు సైతం గాయపడినట్లు సమాచారం.వెంటనే రైల్వే పోలీసులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news