జగన్ సమక్షంలో వైసీపీలోకి ఆనం

-

మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి  వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. విశాఖ జిల్లాలో ఉన్న జగన్.. ఆనంకు పార్టీ కండువా కప్పి సాదరంగా వైసీపీలోకి ఆహ్వానించారు. దివంగత నాయకుడు ఆనం వివేకానందరెడ్డితో కలిసి రామనారాయణ రెడ్డి గతంలో తెదేపాలో చేరిన సంగతి తెలిసిందే…నామమాత్రంగా పార్టీ పదవులు అప్పగించి.. పార్టీలో సరైన ప్రదాన్యత ఇవ్వకపోవడంతో  గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న రామనారాయణ రెడ్డి నేడు వైసీపీలో చేరారు. ఆనం రాకతో నెల్లూరు వైసీపీలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version