రేవంత్ సీఎం అయ్యాక తెలంగాణ లంచాలకు అడ్డగా మారింది : రాజాసింగ్

-

రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ గోషామహల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తెలంగాణ రాష్ట్రం లంచాల అడ్డాగా మారింది. తెలంగాణలో కొందరు పోలీసులు లంచాలు తీసుకోవడం అలవాటుగా మార్చుకున్నారు.పోలీసుల ఛాంబర్లలో కూడా సీసీ కెమెరాలు పెట్టాలి.

కరీంనగర్ జమ్మికుంట సీఐ రవి కుమార్ ఒక బాధితుడి నుండి రూ.3 లక్షలు లంచం తీసుకున్నాడు.గతంలో షాహినాజ్ గంజ్ పోలీసు స్టేషన్ సీఐ బాబు చౌహన్ ఒక వ్యక్తిని కేసు నుండి తప్పించడానికి లంచం అడిగాడు.లంచాలు అడిగే పోలీసులను ఉద్యోగాల నుండి టర్మినేట్ చేయాలి’ అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version