మోదీని తెగ పొగిడేసిన బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్

-

బాలీవుడ్ కిలాడీ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని తెగ పొగిడేశాడు. సినిమాలపై అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ప్రధాని మోదీ ఇటీవల బీజేపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడంపై అక్షయ్‌ ప్రశంసలు కురిపించాడు. మోదీ దేశంలోనే అతిపెద్ద ప్రభావశీల వ్యక్తి అని, ఆయన వ్యాఖ్యలు కాస్తయినా మార్పు తీసుకురాగలిగితే సినీ పరిశ్రమకు గొప్ప మేలు కలుగుతుందని అక్షయ్‌ అన్నాడు.

అక్షయ్ కథానాయకుడిగా నటించిన ‘సెల్ఫీ’ ట్రైలర్‌ విడుదల కార్యక్రమాన్ని ఆదివారం ముంబయిలో నిర్వహించారు. అక్షయ్‌ మాట్లాడుతూ. ‘‘సానుకూల దృక్పథాన్ని ఎల్లవేళలా స్వాగతించాలి. ప్రస్తుత పరిస్థితులు మారాలి. మేం సినిమాలు తీయడానికి ఎంతో శ్రమిస్తాం. ఆ తర్వాత సెన్సార్‌ బోర్డుకు తీసుకెళ్లి ధ్రువీకరణ పొందుతాం. ఇంతా అయ్యాక ఎవరో అనవసర వ్యాఖ్యలు చేస్తారు. దీంతో వివాదాలు రేకెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని చెప్పిన మాటలతో మాకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నాను’’ అని అక్షయ్‌ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version