క‌రోనా ఎఫెక్ట్‌.. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లు మూసివేత‌.. కేవ‌లం ఆ స‌రుకులే డెలివ‌రీ..!

-

క‌రోనా వైరస్ వ‌ల్ల ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా లాక్ డౌన్ అమ‌లవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఈ-కామ‌ర్స్ సంస్థ‌లైన ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లు కూడా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాయి. త‌మ సేవ‌ల‌ను నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాయి. అయితే వినియోగ‌దారుల‌కు అవ‌సర‌మైన నిత్యావ‌స‌రాలు, హెల్త్‌, హైజీన్ ఉత్ప‌త్తుల‌ను మాత్రం డెలివ‌రీ చేస్తామ‌ని ఆ సంస్థ‌లు ప్ర‌క‌టించాయి. ఈ క్ర‌మంలో బుధ‌వారం నుంచే ఆ సంస్థ‌లు త‌మ నిర్ణ‌యాన్ని అమ‌లు చేస్తున్నాయి.

క‌రోనా నేప‌థ్యంలో త‌మ సేవ‌ల‌ను నిలిపివేస్తున్నామ‌ని, వినియోగదారుల‌కు అవ‌స‌రం ఉన్న వ‌స్తువుల‌నే ప్ర‌స్తుతం డెలివ‌రీ చేస్తున్నామ‌ని.. అమెజాన్ ఇండియా గ్లోబ‌ల్ సీనియ‌ర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగ‌ర్వాల్ తెలిపారు. ఈ మేరకు ఆయ‌న ట్వీట్ చేశారు. మరోవైపు ఫ్లిప్‌కార్ట్ కూడా త‌న సైట్‌లో కోవిడ్-19 కార‌ణంగా త‌మ సేవ‌ల‌ను నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

వినియోగ‌దారుల‌కు అవ‌స‌రం ఉన్న నిత్యావ‌స‌రాలు, ప్యాక్డ్ ఫుడ్‌, హెల్త్ కేర్‌, హైజీన్‌, ప‌ర్స‌న‌ల్ కేర్ ఉత్ప‌త్తుల‌ను మాత్ర‌మే ప్ర‌స్తుతం అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లు డెలివ‌రీ చేస్తున్నాయి. అయితే మిగిలిన ఈ-కామ‌ర్స్ సంస్థ‌లు త‌మ నిర్ణ‌యాల‌ను ఇంకా వెల్ల‌డించాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version