పేదల వ్యతిరేక వర్గాన్ని చిత్తుగా ఓడించాలి : సీఎం జగన్

-

పేదల వ్యతిరేక వర్గాన్ని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు ఏపీ సీఎం జగన్. తాజాగా కాకినాడలో జరిగిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బాబుకు ఓటు వేస్తే.. జన్మభూమి కమిటీలతో దోచుకుంటారు. ఫ్యాన్ కు ఓటు వేస్తేనే సకాలంలో ఇన్ పుట్ సబ్సీడీ వస్తుంది. మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల భవిష్యత్.. ఫ్యాన్ కు ఓటు వేస్తేనే ఆరోగ్య శ్రీ కొనసాగుతుంది.

ఎవ్వరి పాలనలో మీకు మంచి జరిగింది.. ఎవ్వరూ ఉంటే మీకు మంచి జరుగుతుందని ఆలోచించి ఓటు వేయాలని కోరారు. రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తేనే.. జగన్ మార్క్ పాలన కొనసాగుతుంది. ఓటు వేయడం పొరపాటు చేస్తే.. చంద్రముఖీ లేచి మీ పిల్లల భవిష్యత్ నాశనం చేస్తుంది. పసుపుపతి నిద్ర లేచి వదలబొమ్మాళి వదలా అంటాడు. ఫ్యాన్ కు ఓటు వేస్తేనే ఇంటింటికి ప్రయోజనాలు జరుగుతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version