బ్రేకింగ్ : ఏసీపీ నరసింహా రెడ్డి కేసులో మరో 8 మంది అరెస్టు

-

ఏసీపీ నరసింహా రెడ్డి కేసులో మరొక 8 మంది అరెస్టు అయ్యారు. ఇప్పటికే ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నరసింహ రెడ్డి అరెస్ట్ చేసిన ఏసీబీ ఆయన నుండి కీలక సమాచారాన్ని రాబడుతోంది. మాదాపూర్లోని రెండు వేల గజాల స్థలం వివాదంలో జోక్యం చేసుకున్న నరసింహారెడ్డి బినామీల పేర్లతో మాదాపూర్ లాండ్ ని దక్కించుకున్నట్టు తేలింది.

 

మార్కెట్ విలువ ప్రకారం దాదాపుగా 50 కోట్లు చేస్తుందని ఏసిబీ అంచనా వేస్తోంది. ఎనిమిది మంది కలిసి తప్పుడు పత్రాలతో లాండ్ ని స్వాధీనం చేసుకున్నట్లుగా నిర్ధారణకు వచ్చిన ఏసీబీ ఏసీపీ నర్సింహారెడ్డికి సాయం చేసిన ఎనిమిది మందిని అరెస్టు చేసి రిమాండ్ తరలించింది. ఇక విచారణ ముగిసే నాటికి ఏసీపీ ఆస్తుల విలువ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. మాదాపూర్ కు చెందిన ఒక మహిళ పేరు మీద నరసింహారెడ్డి ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించారు. గతంలో కూడా ఒక ఎస్సైని పట్టుకొని అతని చేత భూ అక్రమాలు చేయించినట్టు కూడా గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news