ఏపీ లో నేడు 101 క‌రోనా కేసులు.. ఒక‌రు మృతి

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రం లో గ‌డిచిన 24 గంట‌ల లో కొత్త గా 101 కరోనా కేసులు వెలుగు చూశాయి. అలాగే క‌రోనా మ‌హ‌మ్మారి బారి న ప‌డి ఒక‌రు మృతి చెందారు. కాగ నేటి కొత్త కేసుల తో ఆంధ్ర ప్ర‌దేశ్ లో మొత్తం కేసుల సంఖ్య 2,83,18,432 కు చేరింది. అలాగే నేటి తో ఆంధ్ర ప్ర‌దేశ్ లో క‌రోనా మ‌హమ్మారి బారిన ప‌డి 14,439 మంది మృతి చెందారు. అలాగే ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రం లో గ‌డిచిన 24 గంట‌ల లో 138 మంది కరోనా వైర‌స్ ను జ‌యించారు.

దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రం లో క‌రోనా ను 20,53,289 మంది జ‌యించారు. కాగ రాష్ట్రంలో ప్ర‌స్తుతం 2,102 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగ గ‌డిచిన 24 గంట‌ల లో రాష్ట్ర వ్యాప్తం గా 18,730 క‌రోనా వైర‌స్ సాంపిల్స్ ను ప‌రీక్షించారు. దీంతో ఇప్ప‌టి వ‌రకు రాష్ట్రం లో మొత్తం 3,03,91,157 క‌రోనా వైర‌స్ సాంపిల్స్ ను ప‌రీక్షించారు. కాగ గ‌త కొద్ది రోజుల నుంచి పోలిస్తే నేడు రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య కాస్త త‌గ్గింది. అయితే క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ తో ప్ర‌జ‌లు జాగ్ర‌త గా ఉండాల‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news