ఆంధ్రప్రదేశ్ లో మరో దారుణం..ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం

-

చిత్తూరు జిల్లా కుప్పం లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఆరేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. బాలిక తండ్రి కుప్పం పట్టణంలో జ్యూస్ బండి నడుపుతున్నాడు. రాజస్థాన్ నుంచి తరలివచ్చిన ఈ కుటుంబం పట్టణంలో నివాసం ఉంటుంది. మంగళవారం రాత్రి అతడి ఆరేళ్ళ కుమార్తె ఆరుబయట ఆడుకుంటుండగా.. కుప్పం కొత్తపేట రాంనగర్ కు చెందిన శ్రీధర్(45) అటుగా వచ్చాడు.

మద్యం మత్తులో ఉన్న అతడు బాలికను మభ్యపెట్టి పక్కనే ఉన్న పాడుబడ్డ భవనం లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు వేయడంతో స్థానికులు శ్రీధర్ ని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను కుప్పం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసింది అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. పసివాళ్ళపైన అఘాయిత్యానికి పాల్పడుతున్న కామాంధుల పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version