ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..సభకు ప్రణమిల్లి అడుగుపెట్టిన సీఎం చంద్రబాబు

-

ఏపీ శాసనసభ సమావేశాలు శుక్రవారం ఉదయం 9.46 గంటలకు ప్రారంభం అయ్యాయి. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు సభలోకి అడుగుపెట్టారు. మొదట ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీ మెట్లకు ప్రణమిల్లిన ఆయన సగౌరవంగా గౌరవ సభలోకి అడుగుపెట్టారు. మొదటగా సభ్యులంతా జాతీయ గీతం ఆలపించారు. అనంతరం ప్రొటెం స్పీకర్‌ నియామకంపై అసెంబ్లీ కార్యదర్శి ప్రకటన చేశారు. ఆ తర్వాత సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి రిజిస్టర్లలో సంతకాలు చేశారు.

ఇక ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభ్యులందరితో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రమాణం చేయిస్తున్నారు. తర్వాత డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రమాణ స్వీకారం చేస్తారు. మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్‌ సాధారణ సభ్యుడిగానే ప్రమాణం చేస్తారు. ఆంగ్ల అక్షరాల వరుస క్రమంలో సభ్యులను పిలుస్తారు. అనంతరం శాసనసభ సభాపతి ఎన్నికల ప్రక్రియను ప్రకటిస్తారు. దాదాపుగా సభ్యులందరితో ఇవాళే ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version