నేడు, రేపు ఢిల్లీలో ఏపీ సీఎం జగన్ పర్యటన

-

నేడు, రేపు ఢిల్లీలో ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నాడు. నిన్న లండన్ నుంచి ఏపీకి చేరుకున్నారు ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. ఈ తరుణంలోనే క్యాంపు కార్యాలయంలో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో తాజా పరిణామాలు, శాంతిభద్రతలపై నిన్న సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అలాగే… నేడు, రేపు ఢిల్లీ పర్యటనకు ఏపీ సీఎం జగన్ పర్యటనకు వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే సీఎం జగన్‌ ఉండనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాలను కలవనున్నారు సీఎం జగన్.

CM Jagan 

కాగా, లండన్‌ పర్యటన ముగించుకుని ఏపీకి చేరుకున్నారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్. ఈ మేరకు లండన్‌ పర్యటన ముగించుకుని నేరుగా గన్నవరం ఎయిర్ పోర్టుకు సీఎం జగన్ చేరుకున్నారు. కాగా, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ నేత వంగవీటి రాధాలకు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యాయి. ఎనిమిదేళ్ల క్రితం కేసుకు సంబంధించి వీరికి కోర్టు వీరికి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 2015లో ప్రత్యేక హోదాను కోరుతూ విజయవాడ బస్టాండ్ వద్ద వైసీపీ నేతలు ధర్నా చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version