బాలీవుడ్ డ్రగ్స్ కేసు : రేపో మాపో ప్రముఖ హీరోలకు సమన్లు !

-

బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో మరి కొందరు నటుల మీద దృష్టిపెట్టారు ఎన్సీబీ అధికారులు. దీపిక, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్, రకుల్‌ ప్రీత్ సింగ్ లను విచారించిన క్రమంలో వారి నుండి సమాచారాన్ని సేకరించిన ఎన్సీబీ అధికారులు మరికొందరు సినీ నటుల కాల్‌ డేటాను పరిశీలిస్తున్నారు. బాలీవుడ్ సహా టాలీవుడ్ లోని కొందరి ఫోన్ల మీద ఎన్సీబీ అధికారులు నిఘా పెట్టారు.

త్వరలో ముగ్గురు బాలీవుడ్‌ యాక్టర్లు సహా ఒకరిద్దరు టాలీవుడ్ నటులకు కూడా సమన్లు జారీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈ డ్రగ్స్ కేసులో ముగ్గురు హీరోయిన్లకు త్వరలో మళ్లీ ఎన్సీబీ నుండి పిలుపు రావచ్చని అంటున్నారు. డ్రగ్స్ తీసుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరోయిన్లను మళ్లీ ఎన్సీబీ ప్రశ్నించనున్నట్టు చెబుతున్నారు. ఎన్సీబీ నెట్‌వర్క్‌లో టాప్ హిందీ హీరోయిన్లు ఉన్నట్టు గట్టిగా ప్రచారం జరుగుతోంది/

Read more RELATED
Recommended to you

Latest news