ఏసీబీ కోర్టులో చంద్రబాబు మరో పిటీషన్‌..!

-

 

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ తరుణంలోనే నేడు ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ జరుగనుంది. బెయిల్, మధ్యంతర బెయిల్ రెండు పిటిషన్ల మీద కూడా విచారణ చేయనున్నారు ఏసీబీ న్యాయమూర్తి. పిటిషన్ లో చంద్రబాబు పేర్కొన్న అంశాలు పరిశీలిస్తే.. నా పాత్రపై ప్రాథమిక ఆధారాలు లేకపోయినా సీఐడీ కేసు నమోదు చేశారని చంద్రబాబు పేర్కొన్నారు.

Another petition of AP government against Chandrababu in ACB court

స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ ఇచ్చిన ఫిర్యాదులో నా పేరు లేదని వెల్లడించారు. రాజకీయ ప్రతీకారంతో ఈ కేసులో నన్ను లాగారని ఫైర్ అయ్యారు చంద్రబాబు. ప్రధాన బెయిల్ పిటిషన్ తేలేలోపు మధ్యంతర బెయిల్ ఇవ్వండని.. కేసు నమోదు చేసిన 22 నెలల తర్వాత నాపై ఆరోపణలు మళ్లీ తెర మీదకు తెచ్చి సీఐడీ కేసు పెట్టిందని వివరించారు. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17ఏ ప్రకారం గవర్నర్ ఆమోదం లేకుండా నా పేరు FIR లో చేర్చటం, దర్యాప్తు, అరెస్ట్ చేయటం చట్ట విరుద్ధం అంటూ మండిపడ్డారు చంద్రబాబు. బెయిల్ ఇవ్వటానికి ఈ ఒక్క కారణం సరిపోతుందని…తప్పుడు కేసు అయినా..దర్యాప్తుకు సహకరించటానికి సిద్దంగా ఉన్నానన్నారు. సాక్షులను ప్రభావితం చేయటం, సాక్ష్యాలను తారుమారు చేస్తాను అనే సీఐడీ వాదనకు ఆధారాలు లేవని చెప్పారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version