అమిత్‌ షా, నడ్డాలకు సీఎం జగన్‌ కౌంటర్‌ ?

-

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పై ఏపీ సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తన వెనుక బీజేపీ లేదని.. తనకు ప్రజలు ఉన్నారని వెల్లడించారు సీఎం జగన్‌. జగన్ పాలన మొత్తం అవినీతి, కుంభకోణాలే అంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న విశాఖలో నిర్వహించిన బహిరంగ సభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ప్రసంగించారు.

రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్ర ప్రదేశ్ 3వ స్థానంలో ఉన్నందుకు వైఎస్ జగన్ సిగ్గుపడాలంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు అమిత్ షా. అయితే.. ఆయన చేసిన వ్యాఖ్యలకు జగన్‌ డైరెక్ట్‌ కౌంటర్‌ ఇవ్వలేకపోలేదు. కేవలం తన వెనుక బీజేపీ లేదని.. తనకు ప్రజలు ఉన్నారని వెల్లడించారు. అమిత్ షా, జేపీ నడ్డా విమర్శలపై నోరెత్తని సీఎం జగన్…కేవలం చంద్రబాబుకు బీజేపీ అండగా ఉందని పరోక్షంగా చెప్పారు. బిజెపి నాకు తోడుగా లేదన్న జగన్‌… రాబోయే ఎన్నికల్లో వైసీపీకి బీజేపీ అండగా ఉండదని తేల్చి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version