నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్‌

-

అమరావతి : నేడు కర్నూలు జిల్లాలో ఏపీ సీఎం వైయస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి పర్యటించనున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుమ్మటం తండా వద్ద ఇంటిగ్రేటెడ్‌ రిన్యూవబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్టుకు ఈ పర్యటన సందర్భంగా శంకుస్ధాపన చేయనున్నారు ఏపీ సీఎం వైయస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి.

CM Jagan Mohan Reddy

ఇందులో భాగంగానే… ఉదయం 10 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరనున్నారు ఏపీ సీఎం వైయస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి. ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి గుమ్మటం తండ వద్ధ ఇంటిగ్రేటెడ్‌ రిన్యూవబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్టు(గ్రీన్‌కో)కు చేరుకోనున్నారు ముఖ్యమంత్రి జగన్‌.

ఇంటిగ్రేటెడ్‌ రిన్యూవబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ (గ్రీన్‌కో) ప్రాజెక్టు పనులకు శంకుస్ధాపన చేయనున్న సీఎం జగన్… మధ్యాహ్నం 2.05 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు. ఇదిలా ఉంటే నిన్న జరిగిన ఏలూరు బహిరంగ సభలో ప్రతిపక్షం టీడీపీతో పాటు ఎల్లోమీడియా అంటూ పలు టీవీ ఛానెళ్లు, పేపర్లపై విమర్శలు గుప్పించారు. ఇక దత్తపుత్రుడు అంటూ పవన్ కళ్యాణ్ ను విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version