ధర్మాన ప్రసాదరావుకు చంద్రబాబుకు మధ్య రహస్య ఒప్పందం – GVL నరసింహారావు

-

MP GVL నరసింహారావు సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టులు, విశాఖ భూ కబ్జాల పై బహిరంగ చర్చకు సిద్ధమా….త్వరలోనే బహిరంగ చర్చకు పిలుస్తామని వైసీపీ,టీడీపీలకు ఎంపి జీవీఎల్ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.

పోలవరం ప్రాజెక్ట్ కేంద్రం నిర్మిస్తుంటే వైసీపీ,టీడీపీలు ప్రగల్భాలు పలుకుతున్నాయి …పోలవరం నిర్మాణం ఆలస్యంకు వైసీపీ ప్రభుత్వం చేతకాని తనం కారణమన్నారు.కేంద్రం నిధులిస్తే ప్రాజెక్ట్ ప్రారంభించిన చంద్రబాబు కమిషన్ల కోసం పోలవరం తీసుకున్నారు.. 14ఏళ్ల ముఖ్యమంత్రిగా వుండి రాష్ట్రంలో ఎందుకు ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు రాలేదని ఫైర్ అయ్యారు.

విశాఖ భూ దోపిడీలో టీడీపీ,వైసీపీ తోడు దొంగలు….రెండు సిట్ లు ఏర్పాటు చేసిన ఎందుకు నివేదికలు బయటపెట్టలేదన్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు కు చంద్రబాబు కు ఉన్న లాలూచీ ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. భూ దోపిడీలో వైసీపీ,టీడీపీ భాగస్వాములయ్యాయి…..పార్లమెంట్ సమావేశాల్లో వైజాగ్ భూ స్కామ్ పై ప్రస్తావించి దేశం మొత్తం తెలిసే విధంగా చేస్తామన్నారు. గతంలో భూ స్కామ్ లపై మాట్లాడిన అయ్యన్న పాత్రుడు ఎందుకు సైలెంట్ అయ్యారు….గతంలో భూముల గురించి మాట్లాడి ఇప్పుడు మౌనం పాటిస్తున్నారంటే వాళ్ళ చిత్తశుద్ధిని అనుమానించాల్సి ఉంటుందన్నారు GVL నరసింహారావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version