పాదయాత్రలు కాదు.. పాకుడు యాత్రలు చేసినా ప్రజలు పట్టించుకోరు – జోగి రమేష్

-

ప్రతిపక్ష పార్టీలపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి జోగి రమేష్. నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న వారాహి యాత్రతో పాటు టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర పై ఆయన సెటైర్లు వేశారు. వాళ్లు పాదయాత్రలకు బదులుగా పాకుకుంటూ యాత్రలు చేసినా, పొర్లు దండాలు పెట్టినా ప్రజలు వారిని నమ్మరని అన్నారు.

వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిని ప్రజలు బంగాళాఖాతంలో ముంచడం ఖాయమని స్పష్టం చేశారు. విపక్షాల యాత్రలన్నీ కాపీ యాత్రలని కొట్టి పారేశారు. ఇక ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపరుచుకోవాలని సీఎం జగన్ సూచించారని అన్నారు. తాము గెలవడమే తమకు ముఖ్యమని జగన్ తెలిపారని అన్నారు. ఎమ్మెల్యేల పనితీరు మార్చుకోవడానికి మరో అవకాశం ఉందని పేర్కొన్నారు జోగి రమేష్. ఏపీలో రానున్న ఎన్నికలలో 175 నియోజకవర్గాలలో వైసిపి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version