కడప జిల్లాకు గోవా నుంచి కోటి రూపాయల మద్యం తరలింపు

-

Movement of liquor from Goa to Kadapa district: కడప జిల్లాకు గోవా నుంచి కోటి రూపాయల మద్యం తరలించిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు.పులివెందుల శివార్లలో వద్ద గోవా మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఆర్ తుమ్మల పల్లె వద్ద వాహనాల తనిఖీ లో ఐచర్ వాహనం పట్టుకున్నారు పులివెందుల పోలీసులు.

Movement of liquor worth crores of rupees from Goa to Kadapa district

ఐచర్ వాహనం నిండా 90 లక్షలు విలువ చేసే 13008 మద్యం బాటిల్లను పట్టుకున్నారు పోలీసులు. ఐచర్ వాహనం.. స్కార్పియో లో వెనుకే వస్తున్న 7 మంది నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. ఇక పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ సంఘటన పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. ఈ సంఘటనపై మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు డిఎస్పీ మురళి నాయక్.

Read more RELATED
Recommended to you

Exit mobile version