మోదీతో అకీరా.. రేణూదేశాయ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌ వైరల్

-

ఆంధ్ర ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ అఖండ విజయం సాధించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి అకీరా నందన్ తన తండ్రితోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే పవన్ తన తనయుడిని రాజకీయ ప్రముఖులకు పరిచయం చేస్తున్నారు. తాజాగా ప్రధాని మోదీని వీరు కలిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అకీరా తల్లి రేణు దేశాయ్‌ ఓ ఎమోషనల్ పోస్ట్‌ పెట్టారు.

‘నాకు మొదటి నుంచి బీజేపీ అంటే అభిమానం. మోదీ పక్కన నా కుమారుడిని చూస్తుంటే ఎంతో ఆనందంగా, ఎమోషనల్‌గా ఉంది. దానిని మాటల్లో వర్ణించలేను. మోదీ గారిని కలిశాక అకీరా నాకు ఫోన్‌ చేసి తన అనుభూతిని పంచుకున్నాడు. ఆయన చాలా గొప్ప వ్యక్తి అని. తన చుట్టూ ఓ పాజిటివ్ వైబ్‌ ఉందని చెప్పాడు’ అని ఈ పోస్టులో రాస్తూ ఎమోషనల్ అయ్యారు రేణు.

మరోవైపు తాజాగా జరిగిన ఎన్డీయే కూటమి నేతల సమావేశానికి పవన్‌ తన కుటుంబంతో సహా హాజరయ్యారు. తన కుమారుడు అకీరాను సైతం దిల్లీకి తీసుకెళ్లి మోదీకి తన కుటుంబాన్ని పరిచయం చేశారు. ఈ సందర్భంగా అకీరా ప్రధాని మోదీకి నమస్కరిస్తుండగా అతడి భుజంపై చేయి వేసి మోదీ మాట్లాడుతున్న ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version