మాజీ మంత్రి బండారు వ్యాఖ్యలపై స్పందించిన రోజా..!

-

టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యానారాయణ వ్యాఖ్యలపై మంత్రి రోజా స్పందించారు. మాజీ ఎమ్మెల్యేగా పని చేసిన ఓ వ్యక్తి మహిళా మంత్రి పై చేసిన వ్యాఖ్యలు దారుణమని పేర్కొన్నారు. బండారు వ్యాఖ్యలు వింటే అతని తల్లిదండ్రుల పెంపకం ఎలాంటిదో అర్థమవుతుందన్నారు. మహిళలు స్వతంత్రంగా బతికేలా ఉండాలని.. వారని అవమానిండం నేరమని మండిపడ్డారు రోజా.

స్థాయిని బట్టి కాకుండా ప్రతీ మహిళకు గౌరవం దక్కాలన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై కూడా మంత్రి రోజా ఫైర్ అయ్యారు. దోచుకున్న వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. బాబు గాడ్సే కంటే ఘోరమైన వ్యక్తి అని మండిపడ్డారు. చంద్రబాబు జీవితమే హింసా మార్గమని.. జైలుల ఆయన దీక్ష చేయడం అంటే.. గాందీజిని అవమానించడమేనని పేర్కొన్నారు. గొడ్డు కన్నా హీనం, గాడ్సె కంటే ఘోరం అని చంద్రబాబును ఉద్దేశించి గతంలో ఎన్టీఆర్ అన్నారని మంత్రి రోజా గుర్తు చేశారు. చంద్రబాబు నిరహార దీక్షను ఖండిస్తున్నామని తెలిపారు. కోటి సభ్యత్వం అంటున్న టీడీపీకి కంచాలు మోగించడానికి జనాలు ముందుకు రాలేదని విమర్శింారు. 15 సీట్లలో పోటీ చేసేందుకు కూడా జనసేనకు అభ్యర్థులులేరన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version